ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు.. రెండు రోజుల్లో 30 మృతి..!
దిల్లీ:, 1 జూన్ (హి.స.)ఈశాన్య భారతదేశంలో వర్షాలు తీవ్రవినాశం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజుల్లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం రాష్ట్రాల్లో ఏర్పడిన వరదల వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఒక్కరోజే 14 మంది మృతి చెందారు. ఇక అ
ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు.. రెండు రోజుల్లో 30 మృతి..!


దిల్లీ:, 1 జూన్ (హి.స.)ఈశాన్య భారతదేశంలో వర్షాలు తీవ్రవినాశం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజుల్లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం రాష్ట్రాల్లో ఏర్పడిన వరదల వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఒక్కరోజే 14 మంది మృతి చెందారు. ఇక అస్సాంలో 12 జిల్లాల్లో వరదలు పలు గ్రామాలను ముంచెత్తాయి. సుమారు 60,000 మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితులయ్యారు. కామ్‌ రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో గత 24 గంటల్లో వరుసగా జరిగిన కొండచరియల ప్రభావం వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

బొండా ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు మట్టిలో పడి మరణించారని ఆ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి జయంత మల్ల బరువా తెలిపారు. ఇక గువాహటిలో గత 67 ఏళ్లలో లేనంతగా 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీని ఫలితంగా బ్రహ్మపుత్రా సహా అనేక నదుల నీటిమట్టం పెరిగింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ కొండచర్యలు విరిగి పడిపోవడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఈస్ట్ కమెంగ్ జిల్లాలో జరిగిన ఓ విషాద సంఘటనలో 7 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఒక కారులో ప్రయాణిస్తుండగా కొండచర్యలు విరిగి పడిపోవడంతో కారు లోయలోకి పడిపోయింది. దానితో అందులోని వారందరు మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన అరుణాచల్ హోం మంత్రి మామా నటుంగ్ సోషల్ మీడియా ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ప్రజలను వర్షాకాలంలో రాత్రి ప్రయాణాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande