దిల్లీ: ‘, 1 జూన్ (హి.స.)టైగర్ మ్యాన్’గా పేరొందిన వన్యప్రాణి సంరక్షకుడు, రచయిత వాల్మీక్ థాపర్ (73) కన్నుమూశారు. దిల్లీలోని తన నివాసంలో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. 1952లో జన్మించిన థాపర్ తన జీవితాన్ని పులుల సంరక్షణ కోసం, ముఖ్యంగా రాజస్థాన్లోని రణథంబోర్ జాతీయ ఉద్యానవనానికి అంకితం చేశారు. 1988లో రణథంబోర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వన్యప్రాణుల పరిరక్షణ విధానాలపై దృష్టిపెట్టారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని వన్యప్రాణి బోర్డు సహా 150కు పైగా ప్రభుత్వ కమిటీల్లో ఆయన భాగమయ్యారు. వన్యప్రాణులపై 30కి పైగా పుస్తకాలు రాశారు. థాపర్ మృతిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు