హైదరాబాద్, 10 జూన్ (హి.స.)
ఆషాడమాస బోనాల పండుగ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో మంత్రి కొండా సురేఖ నేడు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. బోనాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా చిన్న పొరపాట్లు కూడా లేకుండా అద్భుతంగా నిర్వహించాలని సూచించారు. ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలి. బడ్జెట్ లోటు కూడా లేదు.. ప్రభుత్వం నుండి ఇప్పటికే రూ.20 కోట్లు కేటాయించాం. గతంలో ఏం ప్రాబ్లం వచ్చింది.. ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేదానిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ముందుకు వెళ్ళాలని అన్నారు.
ఈ సమీక్షలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభసభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీజీపీ జితేందర్, ఎండోమెంట్ డైరెక్టర్ వెంకట రావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్