అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ.నెల 21 న విశాఖలో.5 లక్షల మందితో. యోగాంధ్ర
అమరావతి, 10 జూన్ (హి.స.)అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఇతర ప్రముఖులు హాజరుకానున్న
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ.నెల 21 న విశాఖలో.5 లక్షల మందితో. యోగాంధ్ర


అమరావతి, 10 జూన్ (హి.స.)అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సన్నాహాల్లో భాగంగా ప్రతి రోజూ వందలాది మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిసున్నారు. సోమవారం వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో సాగర తీరాన యోగాంధ్ర నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రధాని, సీఎంల సైకత శిల్పం ఆకట్టుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande