హైదరాబాద్, 10 జూన్ (హి.స.)
మావోయిస్టు పార్టీ ఇవాళ భారత్ బంద్ కు పిలుపును ఇచ్చింది. కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు ఎన్ కౌంటర్కు నిరసనగా ఈ బంద్ చేపడుతోంది. దీంతో ఆంధ్రా-ఒడిశా బోర్డర్, ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టాయి. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లోని పలు గ్రామాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్