ఈనెల 13న పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన..
తెలంగాణ, పెద్దపల్లి. 10 జూన్ (హి.స.) ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మంజూరైన పోలీస్ స్టేషన్లను ఈనెల 13న రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు ప్రారంభించనున్నారు. నూతనంగా మంజూరైన ప
మంత్రుల పర్యటన


తెలంగాణ, పెద్దపల్లి. 10 జూన్ (హి.స.)

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మంజూరైన పోలీస్ స్టేషన్లను ఈనెల 13న రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు ప్రారంభించనున్నారు. నూతనంగా మంజూరైన పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ తో పాటు ఎలిగేడు పోలీస్ స్టేషన్ ను మంత్రులు ప్రారంభించనున్నారు. దీంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ మేరకు మంత్రుల పర్యటన ఖరారైంద‌ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అధికారులకు తెలియజేయడంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande