తమ భూములు తమకు అప్పగించే వరకు నిరంతర పోరాటం.. ఆదివాసీల ఆందోళన
తెలంగాణ, ఖమ్మం. 10 జూన్ (హి.స.) తమ భూములు సర్వే చేసి అప్పగించే వరకు నిరవధిక నిరాహార దీక్ష విరమించేది లేదని ఆదివాసులు స్పష్టం చేశారు. అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు సర్వేనెంబర్ 30, 36, 39 లలో రెవిన్యూ శాఖ తమకు పట్టాలి ఇచ్
ఆదివాసీలు


తెలంగాణ, ఖమ్మం. 10 జూన్ (హి.స.)

తమ భూములు సర్వే చేసి అప్పగించే వరకు నిరవధిక నిరాహార దీక్ష విరమించేది లేదని ఆదివాసులు స్పష్టం చేశారు. అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు సర్వేనెంబర్ 30, 36, 39 లలో రెవిన్యూ శాఖ తమకు పట్టాలి ఇచ్చిన భూమిని అటవీ శాఖ అధికారులు ఆక్రమించుకున్నారని, వెంటనే వాటిని అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు అశ్వరావుపేట తాసిల్దార్, అటవీశాఖ కార్యాలయల ఎదుట చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజు చేరాయి. ఈ సందర్భంగా ఆదివాసీలు నల్ల రిబ్బన్లతో కండ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

కొన్నేళ్లుగా భూముల కోసం ఉద్యమాలు చేస్తున్నామని అయినా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆదివాసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande