
తెలంగాణ, నల్గొండ. 10 జూన్ (హి.స.)
సంవత్సరం పాటు పాఠశాలకు హాజరుకాకపోయినా ఉపాధ్యాయురాలికి వేతనం చెల్లించిన విషయం పై మండల విద్యాధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ నల్గొండ జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత ఘటనపై విచారించి, నల్లగొండ జిల్లా చందంపేట మండల విద్యాధికారి చందర్, ఆమెకు వేతనం చెల్లించిన కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. ఈ చర్యలు విద్యావ్యవస్థలో పారదర్శకతను మెరుగుపరచాలనే దిశగా తీసుకున్నాయని అధికారులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు