పెద్దపల్లి, 10 జూన్ (హి.స.)
ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినిలు తీవ్రంగా గాయపడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మంగళవారం పెద్దపల్లికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఓమసియా, భోజన్నపేటకు చెందిన విద్యార్థిని అక్షయ స్కూటీపై ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినిలు తీవ్రంగా గాయపడగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్