అమరావతి, 10 జూన్ (హి.స.): విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాకపోకలు సాగించే సందర్భాల్లో ట్రాఫిక్ నిలిపివేత సమయాన్ని వీలైనంత తగ్గించేందుకు ‘వీఐపీ మూవ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్’ అనే వ్యవస్థను పోలీసులు పరీక్షిస్తున్నారు. తన వాహనశ్రేణి కోసం ట్రాఫిక్ను నిలిపివేయొద్దని సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో సీఎం నివాసం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ నగరం.. విమానాశ్రయం వరకు సాగే మార్గంలో ఇరువైపులా 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటుచేశారు. ఇవి ఏఐ ఆధారంగా పనిచేస్తాయి. వీటిని విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ