వందే భారత్ ఎక్స్ప్రెస్ పై.రాళ్లు రువ్విన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధుల అరెస్ట్
అమరావతి, 10 జూన్ (హి.స.), వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సపై రాళ్లు రువ్విన ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలులో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జీ.మురళీధర్‌ వివరాలు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీ సా
వందే భారత్ ఎక్స్ప్రెస్ పై.రాళ్లు రువ్విన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధుల అరెస్ట్


అమరావతి, 10 జూన్ (హి.స.), వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సపై రాళ్లు రువ్విన ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలులో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జీ.మురళీధర్‌ వివరాలు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఒంగోలు-సూరారెడ్డిపాలెం స్టేషన్ల మధ్యలో వందేభారత్‌ రైలుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో సీ-5, 8, 11 బోగీల అద్దాలు పగిలాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు... రైలులో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా... ఒంగోలులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్న గంగవరపు రిషీంద్రబాబు, ఎస్‌కే ఖాదర్‌ బాషా, ఎస్‌కే ఆదిష్‌ కరిమూల్లా ఈ పనిచేసినట్టు గుర్తించారు. ఈ నెల 5న ఈ ముగ్గురూ రైల్వేట్రాక్‌ సమీపంలో బీరు తాగారు. ముందుగా కోర్బా-త్రివేండ్రం ఎక్స్‌ప్రె్‌సపై రాళ్లు విసిరారు. అయితే అవి రైలు వరకు వెళ్లలేదు. ఆ తర్వాత వచ్చిన వందేభారత్‌పైనా రాళ్లు విసరడంతో మూడు బోగీల కిటికీ అద్దాలు పగిలాయి. విచారణ అనంతరం ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande