తిరుమల, 10 జూన్ (హి.స.)
తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. కొంతమంది సొంత వాహనాలలో తిరుమలకు చేరుకుంటే.. చాలా మంది భక్తులు ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా తిరుమలకు వస్తుంటారు. మరికొంతమంది భక్తులు శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల ద్వారా తిరుమలకు వెళ్తూ ఉంటారు. అయితే తిరుమలకు వెళ్లే క్రమంలో తిరుపతిలోని అలిపిరి చెక్ పోస్టు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
పవిత్రమైన తిరుమల కొండపైకి నిషేధిత వస్తువులు, మద్యం, మాంసం, ఆయుధాలు వంటివి తీసుకెళ్లకుండా అలిపిరి చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుంటారు.
అలాగే భక్తులు అలిపిరి చెక్ పోస్టు వద్ద తమ సామాగ్రిని తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది. రద్దీ నేపథ్యంలో వాహనాల తనిఖీలు, లగేజీ చెకింగ్ కోసం అలిపిరి వద్ద కాస్త సమయం పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి