
అమరావతి, 12 జూన్ (హి.స.)
ప్రత్తిపాడు, : భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ)కి మండలంలోని పెద్దిపాలెం గ్రామానికి చెందిన డా.అనూష యాదవ్ రాజీనామా చేశారు. ఆ పార్టీ తరఫున గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె రాష్ట్ర సమన్వయ సారథిగానూ ఉన్నారు. తన పదవి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్కు బుధవారం లేఖ పంపారు. తాను ఉన్నత చదువులకు పూర్తి సమయం కేటాయించేందుకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా అధికారానికి దూరంగా ఉన్న వర్గాలను అందలం ఎక్కించాలని బీసీవై పార్టీ కృషి చేస్తోందన్నారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించి, ఎన్నికల్లో పోటీకి ప్రోత్సహించినందుకు పార్టీ అధ్యక్షుడికి అనూష కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ