న్యూఢిల్లీ, 14 జూన్ (హి.స.)
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘోర దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు భారత ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)కు చెందిన సీనియర్ అధికారులతో పాటు ఇతర సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రమాద కారణాలను నిగ్గు తేల్చేందుకు వీరు అంతర్జాతీయ సంస్థల నిపుణులతో కలిసి పనిచేయనున్నారు.ఈ వివరాలను నేడు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో పౌర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు..
ఈ ప్రమాదాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.. తన తండ్రి కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారని, అలాగే విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల బాధ తనకు తెలుసు అన్నారు. భవిష్యత్ లో ఇటువంటి ప్రమాదాల జరగకుండా చూస్తామన్నారు.. దీనికోసం అనుభవజ్ఞులైన వారితో ఒక సలహా కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు..
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..