జూన్‌ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర
హైదరాబాద్, 14 జూన్ (హి.స.) భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు సంబంధించిన కొత్త తేదీ ఖరారైంది. సాంకేతిక సమస్యలతో ఈ రోదసియాత్ర పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొ
జూన్‌ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర


హైదరాబాద్, 14 జూన్ (హి.స.)

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు సంబంధించిన కొత్త తేదీ ఖరారైంది. సాంకేతిక సమస్యలతో ఈ రోదసియాత్ర పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త తేదీని ప్రకటించింది.

యాక్సియం-4 కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి శుభాంశు జూన్‌ 19న రోదసియాత్రకు బయలుదేరనున్నట్లు ఇస్రో తెలిపింది. ఈనెల 11న ప్రయోగానికి ముందు రాకెట్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌ అవుతున్నట్లు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ సమస్యను విజయవంతంగా పరిష్కరించామని ఇస్రో వెల్లడించింది. ఈనేపథ్యంలో కొత్త ప్రయోగ తేదీని ప్రకటించింది.

అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్‌’ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్‌ పైలట్‌ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్య తలెత్తడం వంటి కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

ఇక, భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)తో అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande