శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
తిరుమల, 16 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత నెల రోజులుగా తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో
తిరుమల


తిరుమల, 16 జూన్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత నెల రోజులుగా తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

ఇవాళ తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు.

కాగా ఆదివారం కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉండటంతో.. నిన్న స్వామివారిని 90,815 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 35,007 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే భక్తుల కానుకలతో శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.52 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande