తెలంగాణ, జగిత్యాల. 16 జూన్ (హి.స.)
జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన మహిళలు తమ గ్రామంలో ఆర్టీసీ బస్సులను ఆపడం లేదంటూ సోమవారం ఉదయం నిరసన తెలిపారు. కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులు గంబిర్పూర్ గ్రామానికి వెళ్లి తిరిగి కోరుట్ల కు వస్తున్న సమయంలో తండ్రియల గ్రామంలో గత నాలుగు రోజులుగా ఆపడం లేదంటూ మహిళలు ఆర్టీసీ బస్సును అడ్డుకొని నిరసన తెలిపారు.
ఈ విషయంపై కోరుట్ల డిపో మేనేజర్ కు వినతి పత్రం ఇచ్చామని, అయినా కూడా అధికారులు మా గ్రామాన్ని పట్టించుకోవడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు