తెలంగాణ, వరంగల్. 16 జూన్ (హి.స.)
వరంగల్ లో జరుగుతున్నఅభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. 15 సంవత్సరాల విరామం తర్వాత పేదలకు ఇళ్ల నిర్మాణం జరగడం ఎంతో గర్వకారణమని, ఇందుకు అనుకూలంగా ప్రభుత్వం రూ.22,500 కోట్లు వెచ్చించి నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించిందని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలన్నది తమ ధ్యేయమని పేర్కొన్నారు. తాను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇళ్ల కోసం కృషి చేసినప్పటికీ, అప్పటి కెసిఆర్ ప్రభుత్వం నుంచి సహకారం అందలేదని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు