ఇందిరమ్మ ఇల్లు రాలేదని… వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వరంగల్, 16 జూన్ (హి.స.) వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లోని చెరువు కొమ్ము తండా లో ఇందిరమ్మ ఇల్లు రాలేదని దారవత్ సుమన్ అనే వ్యక్తి గ్రామంలోని మంచినీటి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు. గతంలో తన ఇల్లు కాలిపోయిందని, తనకు ఇందిర
వ్యక్తి నిరసన


వరంగల్, 16 జూన్ (హి.స.)

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లోని చెరువు కొమ్ము తండా లో ఇందిరమ్మ ఇల్లు రాలేదని దారవత్ సుమన్ అనే వ్యక్తి గ్రామంలోని మంచినీటి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు. గతంలో తన ఇల్లు కాలిపోయిందని, తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని లేకుంటే ట్యాంక్ పై నుండి దూకిి ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు . విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, అక్కడికి చేరుకొని అతన్ని కిందికి దించి సముదాయించి నచ్చజెప్పారు. స్థానికుల సమాచారం ప్ర‌కారం… గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వగా, బెడ్ లెవెల్ వరకు నిర్మాణం పూర్తి చేశాడు. అదే బెడ్ పై ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నిరసన చేప‌ట్టాడు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అతన్ని సముదాయించి కిందకు దించ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande