తెలంగాణ, ఆదిలాబాద్ 16 జూన్ (హి.స.)
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బీర్సాయిపేట్ గండి అటవి ప్రాంతంలో ఇవాళ ఉదయం కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు కారు లోనే అక్కడికక్కడే మృతి చెందారు.
108 అంబులెన్స్ ఈఎంటి జాన్, పైలెట్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం… ఆదిలాబాద్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు బెల్లంపల్లి నుండి కారులో ఆదిలాబాద్ వైపు వస్తుండగా బిర్సాయి పేట్ గండి మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది, ఈ ఘటనలో ఇర్ల షహరిష్ (16), గంట విజయ (50)లు కారులోనే మృతి చెందారని, మరో మహిళకు తీవ్రగాయాలై, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలైనట్టు చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు