న్యూఢిల్లీ, 17 జూన్ (హి.స.)
అగ్ర కథానాయకుడు కమల్
హాసన్ నటించిన 'థగ్ లైఫ్' సినిమా విడుదలకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ కొన్ని సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలని ఆపుదామని గుంపులు, అరాచక శక్తులు వీధుల్లోకి వచ్చి గొడవలు సృష్టిస్తే వాటిని అనుమతించబోమని తెలిపింది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా విడుదల చేయాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వం రేపటిలోగా స్పందించాలని ఆదేశించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..