అమరావతి, 19 జూన్ (హి.స.)
తిరుమల: తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రి సర్కిల్ వద్ద గురువారం ఆయన జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. తిరుమలలో భక్తుల నుంచి ప్రైవేటు వాహనాల వారు అధికంగా డబ్బులు వసూలు చేయడాన్ని అరికట్టేందుకు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు బస్సులను ఉచితంగా తిప్పాలని ఏపీఎస్ ఆర్టీసీని కోరినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం.. తిరుమలలో బస్సులను ఉచితంగా నడిపేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషమయన్నారు. ఇందుకు ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సులు) తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భక్తులను ఉచితంగా చేరవేస్తాయని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ