తెలంగాణ, ఆదిలాబాద్. 20 జూన్ (హి.స.) ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యూం (55) శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు ఆయన బంధువులు తెలిపారు. అబ్దుల్ ఖయ్యూం కు తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడని తెలిపారు. అబ్దుల్ ఖయ్యూం మృతిచెందిన విషయం తెలియగానే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఖయ్యూం మృతి పార్టీకి తీరని లోటని, ఆయన పార్టీ కోసం తపించేవారన్నారు. ఆయన అకాలమరణం బాధాకరమన్నారు. ఖయ్యూం కుటుంబ సభ్యులకు ప్రాగాడ సానుభూతి తెలియజేశారు. ఉట్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖయ్యూం మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు