అమరావతి, 20 జూన్ (హి.స.)
విశాఖ: విశాఖపట్నంలో యోగాంధ్ర-2025 కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో 25,000 మంది గిరిజన విద్యార్థులతో 108 నిమిషాల పాటు, 108 సూర్య నమస్కారాలు చేయించనున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించడమే లక్ష్యంగా విద్యార్థులతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జూన్ 21న జరగబోయే కార్యక్రమానికి సంబంధించి విద్యార్థులతో ప్రాక్టీస్ చేయిస్తున్న దృశ్యాలు మీకోసం..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ