ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో. మహిళలకు ఆర్టీసీ.బస్సుల్లో ఉచిత ప్రయాణం
అమరావతి, 20 జూన్ (హి.స.) : ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ లోపే సరికొత్త బస్సులను రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకుంటోంది. ‘PM e-బస్‌ సేవా’ పథకం కింద కేంద్రం సమకూర్చే ఎ
ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో. మహిళలకు ఆర్టీసీ.బస్సుల్లో ఉచిత ప్రయాణం


అమరావతి, 20 జూన్ (హి.స.)

: ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ లోపే సరికొత్త బస్సులను రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకుంటోంది. ‘PM e-బస్‌ సేవా’ పథకం కింద కేంద్రం సమకూర్చే ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించగా.. బస్సుల కొనుగోలు కోసం తగిన ప్రతిపాదనలను ముందుగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంది. ప్రతిపాదనల తయారీ కోసం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటిలో మరో ఆరుగురు సభ్యులను కూడా నియమించింది. కమిటీ సభ్యుడు, కన్వీనర్‌గా ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు వ్యవహరిస్తారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సహా రవాణా, ఆర్థిక, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులను కమిటీలో సభ్యులుగా నియమించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 11 నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వీటి కొనుగోలు కోసం ప్రతిపాదనలు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande