అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం.కావాలని విజయనగరం ఎంపీ పూజలు
అమరావతి, 20 జూన్ (హి.స.) విజయనగరం రూరల్‌: విశాఖపట్నంలో ఈనెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం కావాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించా
అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం.కావాలని విజయనగరం ఎంపీ పూజలు


అమరావతి, 20 జూన్ (హి.స.)

విజయనగరం రూరల్‌: విశాఖపట్నంలో ఈనెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం కావాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం దేవస్థానం నుంచి సైకిల్ ర్యాలీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందేలా విశాఖపట్నంలో యోగా దినోత్సవం నిర్వహిస్తుందని, అది విజయవంతం కావాలని భగవంతుని వేడుకున్నట్లు చెప్పారు. దీంతో ప్రపంచస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు మంచి గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కూటమి నాయకులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande