గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్కు అనుమతులివ్వొద్దు.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్కు సీఎం రేవంత్ బృందం విజ్ఞప్తి
న్యూఢిల్లీ, 19 జూన్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది.ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ తో సమావేశమైన వారు అనంతరం మధ్యాహ్నం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అయ్యారు
సీఎం రేవంత్ బృందం


న్యూఢిల్లీ, 19 జూన్ (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది.ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ తో సమావేశమైన వారు అనంతరం మధ్యాహ్నం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఆర్ పాటిల్ కు వివరించారు. ప్రాజెక్ట్ తెలంగాణ హక్కులకు, ముఖ్యంగా గోదావరి నది జలాలపై హక్కులకు భంగం కలిగిస్తుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-కృష్ణ-పెన్నా నదుల అనుసంధాన పథకంలో భాగంగానే పోలవరం నుంచి 200-400 టీఎంసీ నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించే లక్ష్యంతో ఉన్నారని మంత్రికి వివరించిననట్లుగా తెలుస్తోంది. గోదావరి నీటిని ఏపీకి ఏకపక్షంగా మళ్లించడం వల్ల తెలంగాణకు నీటి లభ్యత తగ్గుతుందని, ఇది రాష్ట్రంలోని వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇక భద్రాచలం, మణుగూరు వంటి ప్రాంతాల్లో ముంపు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విన్నవించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వం గోదావరి నది జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డు (1980)తో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014)ను చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని పేర్కొన్నట్లుగా సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande