రాయ్పుర్: దిల్లీ - , 19 జూన్ (హి.స.)
రాయ్పుర్ విమానంలో ఊహించని సమస్య ఎదురైంది. సాంకేతిక కారణంతో విమానం తలుపులు తెరచుకోలేదు. దీంతో అర గంటకుపైగా ప్రయాణికులు అందులోనే ఉండిపోయారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్తోపాటు రాయ్పుర్ మేయర్ కూడా ఆ సమయంలో ఈ విమానంలోనే ఉన్నారు.
దిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం 6E-6313 మధ్యాహ్నం రాయ్పుర్లో ల్యాండ్ అయింది. ప్రయాణికులు దిగేందుకు సిద్ధమైనప్పటికీ విమాన తలుపులు మాత్రం తెరచుకోలేదు. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా.. సాంకేతిక సమస్య తలెత్తిందని, తెరిచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. చివరకు బయటనుంచి సిబ్బంది వచ్చి డోర్లు తెరవడంతో లోపలున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ