ఏపి.లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి
అమరావతి, 19 జూన్ (హి.స.) : ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ )గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 95శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ‘ఎక్స్‌’ వేదికగా ఆయన వెల్లడించారు. టాపర్లుగా మరోసారి అమ్మాయి
ఏపి.లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి


అమరావతి, 19 జూన్ (హి.స.)

: ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ )గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 95శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ‘ఎక్స్‌’ వేదికగా ఆయన వెల్లడించారు. టాపర్లుగా మరోసారి అమ్మాయిలే సత్తా చాటారని ప్రశంసించారు. ఈ పరీక్షకు మొత్తంగా 27,253మంది దరఖాస్తు చేసుకోగా.. 20,826మంది అర్హత సాధించారని మంత్రి పేర్కొన్నారు. ఈ పరీక్షలో విజయం సాధించిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జూన్‌ 5న ఏపీ లాసెట్‌-2025ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు తమ ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు రిజిస్ట్రేషన్ నంబర్‌, లాసెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande