వాసాలమర్రి గ్రామానికి అన్యాయం చేసిన కెసిఆర్.. మంత్రి పొంగులేటి
తెలంగాణ,యాదాద్రి భువనగిరి 19 జూన్ (హి.స.) మాజీ సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామంలో ప్రభుత్వ సొమ్ముతో భోజనం చేసి, గ్రామస్తులకు అబద్ధపు హామీలు ఇచ్చి, తన స్వార్ధ రాజకీయంతో గ్రామస్తులు అందరిని మోసం చేసి వాసాలమర్రిని ఆగం ఆగం చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మ
మంత్రి పొంగులేటి


తెలంగాణ,యాదాద్రి భువనగిరి 19 జూన్ (హి.స.)

మాజీ సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామంలో ప్రభుత్వ సొమ్ముతో భోజనం చేసి, గ్రామస్తులకు అబద్ధపు హామీలు ఇచ్చి, తన స్వార్ధ రాజకీయంతో గ్రామస్తులు అందరిని మోసం చేసి వాసాలమర్రిని ఆగం ఆగం చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని 227 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మంత్రికి ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గతంలో మాజీ సీఎం కేసీఆర్ తో కలిసి భోజనం చేసిన ఆకుల ఆగవ్వకు ఇందిరమ్మ ఇంటి మొదటి ప్రొసీడింగ్ పత్రాన్ని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande