గచ్చిబౌలి అమెరికా కాన్సులేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. వామపక్ష నాయకుల అరెస్ట్
హైదరాబాద్, 19 జూన్ (హి.స.) గచ్చిబౌలిలోని అమెరికా కాన్సులేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు తెలపడాన్ని నిరసిస్తూ.. అమెరికా కాన్సులేట్ దగ్గర వామపక్ష పార్టీలు గురువారం
ఉద్రిక్తత


హైదరాబాద్, 19 జూన్ (హి.స.)

గచ్చిబౌలిలోని అమెరికా కాన్సులేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు తెలపడాన్ని నిరసిస్తూ.. అమెరికా కాన్సులేట్ దగ్గర వామపక్ష పార్టీలు గురువారం ధర్నాకు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం నుంచి యూఎస్ కాన్సులేట్ దగ్గర భారీగా పోలిసులను మోహరించారు. కాన్సులేట్ దగ్గర ధర్నాకు వచ్చిన వామపక్ష పార్టీల నేతలను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక వాహనాల్లో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. వామపక్ష పార్టీల నాయకులను అరెస్ట్ చేస్తున్న క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande