హైదరాబాద్, 19 జూన్ (హి.స.)
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్
పరిధిలోని దుర్గం చెరువులో గురువారం ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. బాధితురాలిని సుష్మ (27)గా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుఝామున 4 గంటలకు బొట్టు అంజయ్య అనే వ్యక్తి మిస్సింగ్ కంప్లైంట్ను మాదాపూర్ పోలీసులకు ఇచ్చారు. ఆఫీస్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సుష్మ తిరిగి రాకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఉదయం 7 గంటలకు దుర్గం చెరువు వద్ద ఒక మృతదేహం కనిపించిందని సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. అది మిస్సింగ్ అయిన సుష్మదిగా గుర్తించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..