అమరావతి, 19 జూన్ (హి.స.)
విజయనగరం రూరల్: విశాఖపట్నంలో ఈనెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి అధికారులు ట్రయల్రన్ నిర్వహించారు. గురువారం ఉదయం విజయనగరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ దీన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి 16 బస్సులు బయల్దేరాయి. బస్సులో కలెక్టర్, జిల్లా అధికారులు, యోగా సాధకులు, ప్రజలు వెళ్లారు. విజయనగరం జిల్లాకు కేటాయించిన వేదికలను పరిశీలించి, ఆయా అంశాలపై అధికారులకు కలెక్టర్ సూచనలు ఇవ్వనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ