ముంబయి, 19 జూన్ (హి.స.)
: వైడ్బాడీ విమానాల అంతర్జాతీయ సర్వీసులను జులై మధ్య వరకూ 15శాతం తగ్గిస్తున్నట్లు బుధవారం ఎయిరిండియా ప్రకటించింది. వైడ్బాడీ బోయింగ్ 777 విమానాల్లో మరింతగా రక్షణ తనిఖీలు చేపట్టనున్నామని వెల్లడించింది. అదనపు జాగ్రత్తల కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా తెలిపింది. నిర్వహణపరమైన ఇబ్బందులతో గడచిన 6 రోజుల్లో 83 అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ