నిజామాబాద్, 19 జూన్ (హి.స.)
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తి చెంది ఆమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైల్వే ఎస్సై సాయి రెడ్డి వెల్లడించారు.
నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ సీహెచ్ సాగర్ వివరాల ప్రకారం.. నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని ఓ మహిళ (60) గురువారం ఉదయం 6.10 ప్రాంతంలో రైలు క్రింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషయంలో ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకొని శవాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూంకు తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..