నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయ మార్కెట్లు..
ఢిల్లీ , 19 జూన్ (హి.స.)దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఉదయం 9.19 సమయంలో సెన్సెక్స్‌ 200 పాయింట్లు పతనమై 81,244 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు తగ్గి 24,754 వద్ద ట్రేడవుతున్నాయి. సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా, మెట్రోపోలీస్‌ హ
Pressure on stock market in early trade, Sensex and Nifty fall


ఢిల్లీ , 19 జూన్ (హి.స.)దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఉదయం 9.19 సమయంలో సెన్సెక్స్‌ 200 పాయింట్లు పతనమై 81,244 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు తగ్గి 24,754 వద్ద ట్రేడవుతున్నాయి. సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా, మెట్రోపోలీస్‌ హెల్త్‌కేర్‌, ఏషియన్‌ ఇండియా గ్లాస్‌, స్టెర్లైట్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌, వరుణ్‌ బేవరేజస్‌, ఆస్ట్రాజెనికా ఫార్మా, ఫ్యూజన్‌ ఫైనాన్స్‌ నష్టాల్లో మొదలయ్యాయి. రియాల్టీ, ఎనర్జీ, పీఎస్‌యూ రంగాల సూచీలు పుంజుకోగా.. మెటల్‌, ఆటో, పవర్‌, టెలికం సూచీలు కుంగాయి.

ఆసియా పసిఫిక్‌ మార్కెట్లలోని ప్రధాన సూచీలు మొత్తం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. షాంఘై 0.86, జపాన్‌ నిక్కీ 0.71, హాంకాంగ్‌ హెచ్‌ఎస్‌ఐ 1.85, దక్షిణ కొరియా కోస్పీ0.26, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.03 శాతం నష్టపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande