రెవెన్యూ శాఖ పటిష్టతకు చర్యలు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ, ఖమ్మం. 2 జూన్ (హి.స.) తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సుసంపన్నంగా నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త
డిప్యూటీ సీఎం


తెలంగాణ, ఖమ్మం. 2 జూన్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సుసంపన్నంగా నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. అలాగే జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. కుల మతాలకతీతంగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ శాఖ పటిష్టతకు చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి పరిపాలన అధికారిని నియమిస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande