అమరావతి, 2 జూన్ (హి.స.)
తిరుపతి జిల్లా పద్మావతీపురం ప్రాంతంలో మీసేవా కేంద్రం వద్ద ఓ కారు దగ్ధమైంది. రహదారి పక్కన ఆగిఉన్న కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ