నెల్లూరు, 2 జూన్ (హి.స.)
: నెల్లూరులోని మండపాలవీధిలో కర్ణాటక డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. బంగారం అక్రమ రవాణా చేసినట్లు నేషనల్ జ్యువెలరీ షాపు యజమాని భావిష్ జైన్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసుకు సంబంధించి డీఆర్ఐ అధికారులు బంగారం దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో డీఆర్ఐ అధికారులతో స్థానిక బంగారు దుకాణాల యజమానులు వాగ్వాదానికి దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ