తెలంగాణ, సిద్దిపేట. 2 జూన్ (హి.స.)
ఉద్దేశపూర్వకంగా భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బజరంగ్ దళ్ నాయకుడు రాజారాంను సోమవారం ఎంపీ రఘునందన్ రావు పరామర్శించి మాట్లాడారు. ప్రతి బక్రీద్ పండుగ వచ్చినప్పుడు గోవధ ఒక ఆనవాయితీ గా మారిందన్నారు. హిందువుల మనోభావాలను గౌరవించాల్సిన ముస్లింలు గోవధ చేయడం దారుణం అన్నారు. దేశంలో మెజారిటీ ప్రజలు గౌరవిస్తున్న గోమాత విషయంలో వారు మానవత్వంతో మనుషులులా ప్రవర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు సరిగా విధులు నిర్వహించక పోవడంతోనే హిందూ సంఘాల నాయకులు గోవులను రక్షిస్తున్నారని అన్నారు. చట్టం చప్రకారం పని చేయాల్సిన పోలీసులు ఒక వర్గానికి వత్తాసు పలకడం సరికాదన్నారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు