హైదరాబాద్, 2 జూన్ (హి.స.)
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. అందులో 11 సంవత్సరాల క్రితం, డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ ఆవిర్భవించి.. లక్షలాది మంది ఆశలు, కలలకు ఒక రూపాన్ని ఇచ్చింది. తెలంగాణ ఉద్యమం కోసం తమ చెమట, జీవితాలను త్యాగం చేసిన వారందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక నివాళులు. ప్రతి పౌరుడికి న్యాయమైన, గౌరవప్రదమైన, సంపన్నమైన భవిష్యత్తును నిర్మించడంలో కాంగ్రెస్ పార్టీ మీతో నిలుస్తుంది. ప్రతి కుటుంబానికి, ప్రతి కలకి మా - హామీలు ఆ అచంచలమైన నిబద్ధతకు ప్రతిబింబంలా నిలుస్తాయి అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..