కాచిగూడ2 జూన్ (హి.స.)
: పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ సమీపంలోని కాచీగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మహ్మద్ సాహెబుద్దీన్ (26), ఫైజాన్ (21) సోమవారం యాకుత్పురా-ఉప్పుగూడ స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా అటువైపుగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సాహెబుద్దీన్ ఎలక్ట్రిక్ పనులు చేయగా, ఫైజాన్ వెల్డింగ్ పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాళ్లు. చేతికందిన కొడుకులు మృత్యువాత పడటంతో తండ్రి కమాల్ విలపిస్తున్న తీరు అక్కడున్న వారి గుండెల్ని మెలిపెట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ