ఢీల్లీ, 2 జూన్ (హి.స.)బీసీసీఐ అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా వచ్చే నెలలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ జులైలో 70వ పడిలోకి అడుగుపెడుతున్నారు.
బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం, 70ఏళ్లు నిండిన వ్యక్తి పదవి నుంచి తప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా సెప్టెంబరులో జరిగే బోర్డు వార్షిక సమావేశం వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.
తర్వాత ఆయన పూర్తిస్థాయి అధ్యక్షుడిగా పోటీ పడే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి