భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా : కిషన్ రెడ్డి
హైదరాబాద్, 20 జూన్ (హి.స.) నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం లాల్ బహదూర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా వేడుకలో కిషన్ రెడ్డ
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 20 జూన్ (హి.స.)

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం లాల్ బహదూర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా వేడుకలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా అని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో యోగాను గుర్తించి, ఆచరిస్తున్నారనీ, ఇది ప్రతి భారతీయుడు గర్వించ దగిన అంశం అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని,యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా బాగుంటే మన ఆరోగ్యం, కుటుంబం, సమాజం, ప్రపంచం బాగుంటుందని,యోగానే మనకు ప్రథమ డాక్టర్. యోగా సర్వరోగ నివారిణి అని తెలిపారు. యోగా పాటించినట్లయితే జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయని, ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande