తిరుపతి , 20 జూన్ (హి.స.) , : శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేస్తోన్న విచారణలో విస్మయపరిచే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు కల్తీ నెయ్యి పంపినట్లు అధికారులు గుర్తించారు. విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకూ భోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు.
తిరుపతిలోని డెయిరీకి కమీషన్లు చెల్లించి ఆ కంపెనీ పేరుతోనే కల్తీ నెయ్యి పంపినట్లు విచారణాధికారులు నిగ్గు తేల్చారు. ఇప్పటివరకు తితిదేకు మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో ఏ12గా ఉన్న భోలేబాబా డెయిరీ జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణా నెల్లూరు ఏసీబీ కోర్టులో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఏపీపీ జయశేఖర్ వ్యతిరేకిస్తూ ఈనెల 17న వినిపించిన వాదనల సందర్భంగా ఈ ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితుడు మాస్టర్మైండ్ అని, బయటకు వస్తే సాక్ష్యాధారాలు మాయం చేస్తాడని, సాక్షులను
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ