ఖమ్మం, 20 జూన్ (హి.స.)
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తల్లి మృతిచెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని లారీ బైక్ ని ఢీకొట్టడంతో తల్లి గుడికందుల సావిత్రి (60) అక్కడికక్కడే మృతి చెందగా కోటేశ్వరావుకి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే బోనకల్లు మండలం గార్లపాడు గ్రామానికి చెందిన గుడికందుల కోటేశ్వరరావు సత్తుపల్లిలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. స్వగ్రామం గార్లపాడు నుంచి తన బైక్ పై తల్లి సావిత్రితో కలిసి సత్తుపల్లి కి వెళుతున్నాడు.
ఈ క్రమంలో పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే బైక్ పై ఉన్న లగేజ్ ని సరి చేసుకునేందుకు నిలిపివేశారు. ఈ క్రమంలో సత్తుపల్లి పై వెళుతున్న గుర్తు తెలియని లారీ ఢీ కొట్టడంతో సావిత్రి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కోటేశ్వరావుకి తీవ్ర గాయాలయ్యాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..