ఎల్ బి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ సందడి.. పాల్గొన్న సెలబ్రెటీలు
హైదరాబాద్, 20 జూన్ (హి.స.) రేపు జూన్ 21 శనివారం న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం రంగురంగులతో ముస్తాబైంది. ఈ సందర్భంగా నేడు శుక్రవారం జూన్ 20న 24 గంటల ముందు కౌంట్ డౌన్ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. యోగా ప్రా
యోగా


హైదరాబాద్, 20 జూన్ (హి.స.)

రేపు జూన్ 21 శనివారం న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం రంగురంగులతో ముస్తాబైంది. ఈ సందర్భంగా నేడు శుక్రవారం జూన్ 20న 24 గంటల ముందు కౌంట్ డౌన్ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసిన ఘనత భారతే అని పలువురు ప్రముఖులు ఈ వేడుకల సందర్భంగా తెలియజేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అందరూ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర బొగ్గు, ఉక్కు, పరిశ్రమల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, శాసన సభ్యులు, ఎంపీలు, సినీ ప్రముఖులు, యోగా గురువులు హాజరయ్యారు. సినీ నటి ఖుష్బూ సుందర్, మీనాక్షి చౌదరి, సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జ లాంటి తారలు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖుష్బూ సుందర్ యోగా ప్రాముఖ్యతను వివరించారు.

ఎల్బీ స్టేడియం యోగా ప్రియులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది పాల్గొనడంతో ప్లేస్ సరిపోకపోవడంతో గ్యాలరీల వరకు కూర్చుని యోగా చేస్తున్నారు. యోగా శిక్షకులు ముందుండి సూచనలు ఇస్తుండగా, శంకారవణంతో యోగాసనాలు ప్రారంభమయ్యాయి. పరామిలటరీ, డిఫెన్స్, విద్యాసంస్థలు, స్టూడెంట్ ఆర్గనైజేషన్లు, యోగా అసోసియేషన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande