విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణ దిక్సూచీ : డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క
హైదరాబాద్, 21 జూన్ (హి.స.) తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో దేశానికి దిక్సూచి కావాల‌ని, ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళుతోంద‌ని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు అన్నారు. ప్ర‌జాభ‌వ‌న్‌లో శ‌న
భట్టి విక్రమార్క


హైదరాబాద్, 21 జూన్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో దేశానికి దిక్సూచి కావాల‌ని, ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళుతోంద‌ని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు అన్నారు. ప్ర‌జాభ‌వ‌న్‌లో శ‌నివారం విద్యుత్ ఉద్యోగుల‌కు డీఏ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమ‌ని, ఇందులో భాగంగా విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 1.944 శాతానికి డీఏని పెంచిన‌ట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్ప మనసుతో తీసుకున్న నిర్ణయం ఫలితంగా రాష్ట్రంలోని 71,417 ఇది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ పెంచిన డిఎ విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్ల తో పాటు ఆర్టిజన్స్ కు వర్తిస్తుందని అన్నారు. గతంలో 14.074% గా ఉన్న డీఏ ను 16.018% శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పెంచిన డిఎ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande