ఫారెస్ట్ అధికారులను హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ
హైదరాబాద్, 22 జూన్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఫారెస్ట్ అంతర్భాగాలలో పనిచేస్తున్న ఫారెస్ట్ గార్డులు, పట్వారీలను మావోయిస్టులు లేఖ ద్వారా హెచ్చరించడం కలకలం లేపింది . ఈ మేరకు కొంట ఏరియా కమిటీ కార్యదర్శి దుల్లా పేరుతో ఒక లేఖ విడుదల చేశారు
మావోయిస్టులు


హైదరాబాద్, 22 జూన్ (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఫారెస్ట్

అంతర్భాగాలలో పనిచేస్తున్న ఫారెస్ట్ గార్డులు, పట్వారీలను మావోయిస్టులు లేఖ ద్వారా హెచ్చరించడం కలకలం లేపింది . ఈ మేరకు కొంట ఏరియా కమిటీ కార్యదర్శి దుల్లా పేరుతో ఒక లేఖ విడుదల చేశారు. ప్రజావ్యతిరేక అటవీ రక్షకులు, పట్వారీల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని, ప్రతిఘటనను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సల్ నిర్మూలన, అభివృద్ధి పేరుతో పోలీసు శిబిరాలు, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, రోడ్లు, వంతెనలు నిర్మిస్తుండగా... మరోవైపు, అటవీ రక్షకులు, పట్వారీలు లోతట్టు ప్రాంతాలలోని గ్రామాల్లోకి ప్రవేశించి, పోలీసుల బలంతో సామాన్య ప్రజల నుండి డబ్బును దోచుకుంటున్నారని ఆరోపించారు.

40 సంవత్సరాలుగా సాగుచేస్తున్న భూమిని ఖాళీ చేయాలని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేయడం ఫై మావోయిస్టులు మండిపడ్డారు. కొందరు ఫారెస్ట్ అధికారులు అటవీ సంపద దోచుకుంటూ కోట్లు గడిస్తున్నారని, ఇది చాలదన్నట్లు అమాయక గిరిజనుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, వారి పద్ధతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande