రేవంత్ రెడ్డి చేతులెత్తేశాడు.. ఇక తెలంగాణకు ఏకైక రక్ష బీజేపీనే: కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
హైదరాబాద్, 22 జూన్ (హి.స.) అప్పులు ఇచ్చేవారు లేరని, నన్ను నమ్మేవాడు లేడని.. సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ (ఆదివారం) సికింద్రబాద్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు చేసి తెలంగ
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 22 జూన్ (హి.స.)

అప్పులు ఇచ్చేవారు లేరని, నన్ను నమ్మేవాడు లేడని.. సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ (ఆదివారం) సికింద్రబాద్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ఒక కుటుంబం బారినపడి ఏ రకంగా బలి అయ్యామో మనకు తెలుసన్నారు. ధనికరాష్ట్రంగా మొదలైన తెలంగాణ.. లక్షల కోట్ల అప్పులపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రకంగా.. అవినీతి పాలనతో, దోపిడీ, కుంభకోణాలతో, అహంకారంతో, కుటుంబ పాలనతో తెలంగాణను దెబ్బతీశారో చూశామన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పనిచేసిందో మనం చూశామని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ను వద్దనుకొని, సోనియా గాంధీ మాటలు నమ్మి.. ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. గడిచిన ఏడాదిన్నరలో ప్రజల నమ్మకాన్ని ఎలా వమ్ము చేసిందో చూస్తున్నామని అన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి.. వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. పరిపాలన చేతగాక.. హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ రాష్ట్రంలో చేతులెత్తేసిందని వెల్లడించారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, కేసీఆర్, రాహుల్ గాంధీ విఫలమయ్యారని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande